/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
AP BREAKING NEWS
వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ తాజాగా జీవో విడుదల చేశారు. సురేష్ బాబు తన కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కనస్ట్రక్షన్ సంస్థ ద్వారా కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులను చేయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో పురపాలక చట్టం నిబంధనలు పాటించనందుకు ఆయనపై వేటు వేశారు.
Also Read : నీళ్లు వదలండి ప్లీజ్.. భారత్ కు పాక్ అధికారిక లేఖ!
30 లక్షల అవినీతి..
కడప పట్టణంలో కాంట్రాక్టులు చేసిన సంస్థ ఎంస్ వర్దిని కన్ స్ట్రక్షన్ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 30 లక్షలకు పైగా మేయర్ అవినీతికి పాల్పడినట్లు మున్సిపల్ శాఖ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మంగళవారం మున్సిపల్ కార్యదర్శి ఎదుట సురేష్ బాబు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణపై సంతృప్తి చెందక పోవడంతో అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది.
Also Read : మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'థుడారమ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్
కడప మేయర్ సురేష్ బాబు పై అనర్హత వేటు పడింది.
— greatandhra (@greatandhranews) May 14, 2025
విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.#kadapa #YSRCP pic.twitter.com/Yv3AgAugh0
Also Read : ఏపీలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు
ఎమ్మెల్యేతో విభేదాలు..
ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కడప మేయర్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవికి మధ్య అనేక సార్లు విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబును కూటమి ప్రభుత్వం కుట్రతో పదవి నుంచి తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సొంత జిల్లాలో మేయర్ ను పదవి నుంచి తొలగించడంతో వైసీపీ అధినేత జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : కుంభమేళా మోనాలిసా రేంజే వేరు.. హీరోతో ఫుల్ ఎంజాయ్ - వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
telugu-news | telugu breaking news