/rtv/media/media_files/2025/01/09/6FyAmO6GZdAAv729ueOp.jpg)
AP CM Chandrababu good news to women government employees
AP News: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. స్త్రీలకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
'శక్తి' యాప్ ప్రారంభం..
ఈ మేరకు శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల గురించి వివరాలు అడిగి తెలుసుకుని వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ఏపీ పోలీసు శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ను ప్రారంభించారు. ర్యాపిడో చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఉమెన్స్ డ్రైవర్లను కొనియాడారు.
Also Read: ఎలన్ మస్క్ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!
అలాగే ప్రజలు మరింత మంది పిల్లలను కనాలని చెప్పారు. నార్త్ ఇండియాలో ప్రతిజంట ముగ్గురు పిల్లలను కంటున్నారని తెలిపారు. కానీ దక్షిణ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదని, తక్కువమంది సంతానాన్ని కలిగి ఉంటున్నట్లు గుర్తు చేశారు. మరికొందరు పిల్లలను పూర్తిగా వద్దనుకుంటున్నారని, ఇలాగైతే భవిష్యత్లో చాలా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా