Mani Ratnam: కమల్ హాసన్ - మణిరత్నం కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన 'తుగ్ లైఫ్' ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. 'నాయగన్ 'లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలయికలో వచ్చిన ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని అందరూ భావించారు. కానీ అభిమానుల ఆశలపై నీళ్ళు జల్లింది! ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద చప్పగా సాగింది.
Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్
క్షమించమని మాత్రమే చెప్పగలం
ఈ నేపథ్యంలో, సినిమా విడుదలైన తర్వాత మొదటిసారిగా దర్శకుడు మణిరత్నం 'తుగ్ లైఫ్' ఫలితం గురించి మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ, ఆయన విమర్శలపై స్పందించారు. మణిరత్నం మాట్లాడుతూ.. "ఒకవేళ ప్రేక్షకులు మళ్ళీ మా నుంచి 'నాయగన్' లాంటి సినిమానే ఆశించినట్లయితే.. క్షమించమని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే మేము అదే పాత విషయాన్ని మళ్ళీ ఎందుకు చేయాలి?" అని ప్రశ్నించారు.
కొత్తగా ప్రయత్నించాం
అయితే మణిరత్నం చెప్పిన దాని ప్రకారం.. 'తుగ్ లైఫ్' ఎప్పుడూ ఒక కొత్త ప్రయత్నం కోసమే చేసింది. అంతేకాని పాత జ్ఞాపకాలను తిరగరాయడం కోసం కాదని అర్థమవుతోంది. తాము తీసుకున్న రిస్క్ అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేదని అన్నారు.
దర్శకుడు మణిరత్నం ఇంకా మాట్లాడుతూ.. "మేము కొత్తగా ఏదో ప్రయత్నించాలని బయలుదేరాం. కానీ ప్రేక్షకులు వేరే రకమైన అంచనాలతో వచ్చారు. మేము చూపించిన దానికంటే ప్రేక్షకులు ఇంకేదో ఆశించారు," అని ఆయన అన్నారు.
ప్రేక్షకుల అంచనాలకు, తాము కమల్ హాసన్తో కలిసి చెప్పాలనుకున్న కథకు మధ్య సరిపోలకపోవడమే సినిమా పరాజయానికి కారణమని మణిరత్నం భావించారు. పాతదాన్ని తిరగరాయడం కాకుండా, కొత్తగా చూపించాలనుకోవడం వల్లనే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.