ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

అమెరికా దాడుల కంటే ముందే ఇరాన్ అణు కేంద్రాలైన నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ ల నుంచి 400 కేజీల యూరేనియం వేరే చోటుకి తరలించింది. అమెరికా ఎత్తును ఇరాన్ తిప్పి కొట్టింది. ఈ విషయంలో అమెరికా ఓటిపోయింది. ట్రంప్ మోసపోయాడు.

New Update
trump

12 రోజులు జరిగిన ఇజ్రాయిల్, ఇరాన్ యుద్దంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. సవాల్, ప్రతి సవాల్ మధ్య ఇరు దేశాల అధినేతలు రివేంజ్ అటాక్‌లకు దిగారు. ప్రత్యేక్షంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్యనే యుద్ధం జరిగింది. కానీ పరోక్షంగా అమెరికా కూడా ఇందులో పాల్గొంది. రెండు దేశాలకు భారీగా నష్టం వాటిల్లింది. మొదట ఇజ్రాయిల్ పైచేయి ఉన్నా.. ఇరాన్ వరుస దాడులతో యుద్ధం చివర నాటికి గట్టిగా ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ఐరన్ డోమ్ ఇరాన్ క్షిపణులను ఎదుర్కొంది. అది ఇజ్రాయిల్‌కు భారీ ఖర్చు అయ్యింది.

ఈ యుద్ధంలో ట్రంప్ చెప్పిన మాట ఒక్కటి కూడా చెల్లలేదు. ఇరాన్‌ని న్యూక్లియర్ ప్రొగ్రామ్‌పై సంతకం పెట్టిస్తామని అన్నాడు. కానీ ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ముగియగానే ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ ప్రారంభించింది. అలాగే ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటన కూడా ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు మొదట ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్ జోకర్ అయ్యాడు. అయితే భవిష్యత్‌లో ఆయన మాట ఎవరూ నమ్మరు. అమెరికా నేరుగా ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది. అవి విజయవంతమయ్యాయని కూడా ట్రంప్ మీడియా సమావేశం పెట్టి చెప్పాడు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ అణుస్థావరాలకు తక్కువ నష్టం జరిగిందని తెలుస్తోంది. అమెరికా దాడుల కంటే ముందే ఇరాన్ అణు కేంద్రాలైన నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ ల నుంచి 400 కేజీల యూరేనియం వేరే చోటుకి తరలించింది. అమెరికా ఎత్తును ఇరాన్ తిప్పి కొట్టింది. ఈ విషయంలో అమెరికా ఓటిపోయింది. ట్రంప్ మోసపోయాడు.

యుద్ధంలో జరిగిన నష్టం 

  • 330కి పైగా ఆయుధాలతో పాటు 200 కి పైగా యుద్ధ విమానాలను ప్రయోగించిన ఇజ్రాయిల్ వైమానిక దళం
  •  ఈ దాడుల్లో ఇరాన్ లో దాదాపు 800 మంది దాకా మృతి. 
  • వారిలో 54 మంది మహిళలు, పిల్లలు 263 మంది, సామాన్య పౌరులు 
  • ఇజ్రాయెల్ లో కూడా 50 మంది మృతి. 1,800 నుండి 3,056 మందికి గాయాలు. 
  • ఆర్థికంగా, ఇరాన్ కు $150-200 బిలియన్లు, ఇజ్రాయెల్ $12 బిలియన్ల నష్టం
  • లెక్కకు రాని నష్టం ఇంతకు డబుల్ ఉండే ఛాన్స్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు