/rtv/media/media_files/2025/05/16/JTygJKJ58uBBK5UQbtzO.jpg)
Vallabhaneni Vamshi Case
Vallabhaneni Vamshi Case: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. త్వరలోనే బెయిల్ పై విడుదల అవుతాడని భావిస్తున్న వేళ ఆయనపై మరో కేసు నమోదైంది. ఆయనపై గన్నవరం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గతంలో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ ఫిర్యాదు చేశారు. మొత్తం 58 పేజీలతో కూడి ఫిర్యాదును పోలీసులకు అందించారు.
దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 142/2025తో వంశీపై గన్నవరం పీఎస్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం వంశీ జైలులో ఉండడంతో ఈ కేసు విషయమై కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో కేసు నమోదు కావడంతో వంశీ ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్నాథ్ సింగ్
ఈ నెల 13న బెయిల్..
ఈ నెల 13న సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. వంశీపై సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, ల్యాండ్ కబ్జా, అక్రమ మైనింగ్ తదితర కేసులు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో.. A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసులో ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసు విషయంలో కోర్టు వంశీకి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో కూడా బెయిల్ వస్తే వంశీ విడుదల అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తాజాగా ఆయనపై మరికొన్ని కేసులు నమోదు అవుతుండడంతో ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనన్న చర్చ సాగుతోంది.
(Vallabhaneni Vamsi Bail | telugu-news | telugu breaking news)