BIG BREAKING : మోదీ సభ సమీపంలో భారీ అగ్నిప్రమాదం!

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభకు సరిగ్గా 5కిలో మీటర్ల దూరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఎల్ అండ్ టీ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో  ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

New Update
modi fire accident

modi fire accident

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.   ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభకు సరిగ్గా 3 కిలో మీటర్ల దూరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఎల్ అండ్ టీ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో  ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రాజధాని నిర్మాణం కోసం పైపులను నిల్వ ఉంచింది ఎల్ అండ్ టీ కంపెనీ. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.  

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

అమరావతి ఒక శక్తి

అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది అని చెప్పుకొచ్చారు.  అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అని ప్రధాని కొనియాడారు.  ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని..  ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని వెల్లడించారు.  

Also Read: Anu Aggarwal: నా మూత్రం నేనే తాగిన.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు: నటి సంచలనం!

మూడేళ్లలో పూర్తి

 అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని .. తిరిగి అప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ఆహ్వానిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి.  మోడీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అన్న సీఎం..  5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.  అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా చేస్తామని సీఎం తెలిపారు.  అమరావతిని పర్యావరణహితంగా తయారు చేస్తామని..   బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయని చంద్రబాబు తెలిపారు.  

Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO

Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు