TDP Worker Murder : ఏపీ (Andhra Pradesh) లో టీడీపీ (TDP) కార్యకర్తను వైసీపీ (YCP) కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మోదుపల్లి రామాంజనేయులు కుమారులు గిరినాథ్ చౌదరి, కళ్యాణ్ చక్రవర్తిలు గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ కార్యకర్తలు వీళ్లతో గొడవలకు దిగారు. టీడీపీ గెలిస్తే ఏం చేయగలదంటూ వారితో వాదించారు. చివరికి పక్కనే పొలంలో గడ్డివాము వద్ద ఉన్న వేటకొడవల్లతో గిరినాథ్ చౌదరి, కళ్యాణ్ చక్రవర్తిలపై దాడికి దిగారు (Brutal Murder).
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఏపీలో దారుణం.. వేటకొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య
ఏపీలో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డిలకు ఆదేశించారు.
Translate this News: