Kodali Nani: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్‌ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్‌ ఆయనను పరామర్శించారు. రేవంత్‌ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు విన్యాసాలు
New Update

Kodali Nani: వైసీపీ ఫైర్‌ బ్రాండ్ లీడర్‌, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తెలంగాణ ముఖ్యమంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాల్సిన అవసరం మాకేంటి..మా ముఖ్యమంత్రిని కలిసేందుకే మాకు సమయం ఉండడం లేదంటూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) గెలిచినప్పుడు జగన్‌ (Jagan)ట్వీట్‌ చేశారు..మళ్లీ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాలా అంటూ ప్రశ్నించారు.

ఆయనకు తుంటి ఎముక విరగలేదు కదా...

కేసీఆర్ (KCR) తుంటి ఎముక విరిగినందుకు సీఎం జగన్‌ ఆయను పరామర్శించారు. రేవంత్‌ ని పరామర్శించడానికి ఆయనకు తుంటి ఎముక విరగలేదు కదా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా...ఆయనను కలవడానికి అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

మద్దతు పలకడంలో వింత ఏముంది..

పక్క రాష్ట్రంలో ఎన్నికలకు , మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ మద్దతు పలకడంలో వింత ఏముందని నాని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి వచ్చి స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షునిగా ఉండమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును గెలిపించుకోవడం కోసం రేవంత్‌ ఏపీకి వస్తారేమో అని నాని వ్యాఖ్యానించారు.

150 కోట్ల కోసం...

చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''150 కోట్ల కోసం విజయవాడ ఎంపీ సీటుని కేశినేని చిన్నికి అమ్మేశారు. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టకాలంలో ఆదుకున్న నానిని చంద్రబాబు నట్టేట ముంచేశారు. చివరికీ నా నియోజకవర్గంలో కూడా 100 కోట్లు ఇచ్చిన వ్యక్తికి సీటు ఇచ్చారని ఆరోపించారు.

Also read: ఈసారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు చార్జీలు వసూలు లేదు

#elections #politics #ap #jagan #chandrababu #revanth-reddy #kodali-nani #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe