ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. సముద్ర తీరాన ఈత కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కడికి చేరుకున్న వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. గల్లంతైన విద్యార్థులలో ఒకరిని కోన ఊపిరితో ఉన్న స్థితిలో సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ హర్ష మరణించాడు. మరో విద్యార్థి రాజ్కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇద్దరు విద్యార్థులు కూడా ఎన్నారై కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
పూర్తిగా చదవండి..AP Crime: విశాఖ ఆర్కే బీచ్లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Translate this News: