సిద్ధిపేటతో ఉద్రిక్తత.. హరీష్‌ రావు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.

New Update
సిద్ధిపేటతో ఉద్రిక్తత.. హరీష్‌ రావు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు సిద్దిపేటలోని మంత్రి హరీష్‌ రావు క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. హరీష్‌ రావు కార్యాలయానికి ఏబీవీపీ కార్యకర్తలు భారీగా వస్తుండటాన్ని గమనించిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వారిని బెజ్జం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకుడు వివేక్.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల సమస్యలను నిర్వీర్యం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

విద్యార్థుల హాస్టల్‌ ఫీజ్‌కు సంబధించిన బకాయిలను కూడా ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. స్కాలర్‌షిప్‌ను సైతం ఇవ్వలేదని విమర్శించారు. పేరుకే రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యను అంధిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. విద్యార్థుల సమస్యలను మాత్రం గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్‌కు విద్యార్థులతో ఎలాంటి పని లేదని అందుకే వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్‌కు ఇప్పుడు కావాల్సింది.. తన అభ్యర్ధుల గెలుపోటములే అన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయన్నారు. 2018లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్‌ కేవలం రెండు సార్లు మాత్రమే పోలీస్‌ నియామక నోటిఫికేషన్లు, ఒక్కసారి మాత్రమే డీఎస్సీ, ఒక్క సారి మాత్రమే గ్రూప్‌ పోస్ట్‌ల నోటిఫకేషన్లు వేశారన్నారు. దీంతో ఐదేళ్లుగా ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు ఉద్యోగం రాకపోవడం వల్ల నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కసారి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisment
తాజా కథనాలు