Houthis : 'సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి'.. ఇరాన్‌కు చైనా హెచ్చరిక

హౌతీ తిరుగుబాటు దారులు ఎర్రసముద్రంలో దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వీటిని ఆపాలంటూ చైనా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తమకు ఏదైనా హానీ జరిగితే.. టెహ్రాన్‌తో వ్యాపార సంబంధాలపై ప్రభావం పడుతుందని.. సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పాలని ఇరాన్‌కు ఆదేశించినట్లు సమాచారం.

New Update
Houthis : 'సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి'.. ఇరాన్‌కు చైనా హెచ్చరిక

China : ఎర్రసముద్రంలో హౌతీ(Houthis) తిరుగుబాటుదారులు గత కొన్ని రోజులుగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ దాడుల్ని ఆపాలంటూ ఇరాన్‌ను చైనా హెచ్చరించింది. చైనా(China) ప్రయోజనాలకు హానీ కలిగితే.. అది ఇరాన్‌ రాజధాని అయిన టెహ్రన్‌తో ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రభావం పడుతుందని.. అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండని ఇరాన్‌(Iran) కు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్‌ వర్గాలు మీడియాకు తెలిపాయి.

ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకలపై దాడులు 

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ - హమాస్‌(Israel - Hamas) మధ్య గత కొంత కాలంగా దాడులు జరుగుతున్న వేళ.. తాజాగా ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఇజ్రాయిల్‌ వైపుకు వెళ్లే.. అక్కడి నుంచి వచ్చి నౌకలు.. లేదా ఆ దేశంతో సంబంధాలున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ఇటీవల హౌతీ రెబల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ వైపుకు వస్తున్న ఓ నౌకను హైజాక్‌ చేయడంతో పాటు.. ఇండియాలో తయారైన జెట్ ఇంధనాన్ని తీసుకెళ్తున్న ఆర్ట్‌మోర్‌ అనే నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

Also Read : తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి మరణశిక్ష అమలు..

మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చు

అయితే హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు.. అమెరికా, బ్రిటన్‌లు కలిసి హౌతీ నౌకలపై దాడులు చేశాయి. అయితే ఈ దాడులు తీవ్రతరమైతే మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగొచ్చని ఇటీవలే ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్‌(Dennis Francis) కూడా అనడం దుమారం రేపింది. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఉన్న వాణిజ్య మార్గంలో ఎర్ర సముద్రం ఉంది. చమురు, ఆహార ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఎన్నో రవాణా జరుగుతుంటాయి. ప్రస్తుతం ఎర్రసముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే చైనా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే టెహ్రాన్‌తో తమ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయనేదానిపై చైనా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఇరాన్ వర్గాలు చెప్పాయి.

Also Read: మైక్రోసాఫ్ట్‌ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే!

Advertisment
తాజా కథనాలు