/rtv/media/media_files/2025/03/19/z5rh6w9liy3uInVPhqBt.jpg)
BRS MLA sudheer reddy Photograph: (BRS MLA sudheer reddy)
BIG BREAKING: LBనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మార్చి 27న కమిషన్ ముందు హాజరు కావాలని ఉమెన్ కమిషన్ ఛైర్మన్ నేరళ్ల శారద నోటీసులు ఇష్యూ చేశారు. ఇదే వివాదంపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
Telangana Women’s Commission has issued summons to LB Nagar MLA Devireddy Sudheer Reddy over his derogatory comments on a woman corporator and asked him to appear before the Commission on 27th March. pic.twitter.com/LsUvKXHSNP
— Sharada Nerella (@sharadanerella) March 19, 2025
Also read; Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!
ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడుల వెనుక కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఉన్నారని ఆరోపణలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి మధ్య హనీమూన్ నడుస్తుందంటూ సంచలనం రేపారు. అంతేకాదు హస్తినాపురం కార్పొరేటర్తో కూడా హనీమూన్ నడుస్తుందనడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ సుధీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు.
సుధీర్ రెడ్డి సిగ్గు, శరం ఉందా? - మధుయాష్కీ
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 18, 2025
నీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
సిగ్గు, శరం ఉందా?
మహిళా కార్పొరేటర్ సుజాతపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన మధుయాష్కి
సుజాతపై మధుయాష్కీ హనీమూన్ చేస్తున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు… pic.twitter.com/9n3Oly9pk8
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
మార్చి 12న మన్సూరాబాద్ డివిజన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అవే పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేయగ వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేసిన తర్వాత మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు శాంతింపజేశారు. కొద్దిసేపటి తర్వాత ఎల్బీనగర్ డివిజన్ లో మరోచోట శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు. పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ సమయంలో రఘువీర్ రెడ్డితో పాటు కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలవగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ వెళ్లి బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. వారిని తీసుకుని డీసీపీ ఆఫీసుకు వెళ్లి ఇష్యూ గురించి వివరించారు.
Also read: Mobile blast : ఆగమైపోయిన అరవింద్.. జేబులో ఫోన్ పేలి యువకుడి ప్రైవేట్ పార్ట్ బ్లాస్ట్