/rtv/media/media_files/2025/06/28/konda-murali-2025-06-28-12-04-03.jpg)
Konda Murali
TPCC Disciplinary Committee : కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరంచడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. కొండా మురళి ఆ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలంతా కొండా దంపతులకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. అనంతరం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపధ్యంలో మురళికి వివారణ ఇవ్వాలని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది.
Also Read : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి
కాగా ఈ నోటీసుల నేపథ్యంలో మురళీ ఈ రోజు క్రమశిక్షణ కమిటీ విచారణ కు హాజరై సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో జరగనున్న విచారణకు కొండా మురళి రానున్నారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వనున్నారు. అయితే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరూ కొండా సురేఖ గురించి తప్పుడు ప్రచారం చేశారని, వారిని కూడా క్రమశిక్షణ కమిటీ వివరణ కోరాలని టీపీసీసీకి ఇప్పటికే కొండా సురేఖ అనుచరులు ఫిర్యాదు చేశారు. అయితే కొండా మురళిమీద వేటువేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పట్టుపడుతున్న నేపథ్యంలో మురళిని పార్టీ నుంచి భహిష్కరిస్తారా? లేదా క్షమాపణలు చెప్పిస్తారా అనేది వేచి చూసి తర్వాత కార్యచరణ ప్రకటించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన