Nalgonda Crime: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను లేపేసింది.. మహా తల్లి!

భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తుండడంతో పాటు అతని ప్రభుత్వం వస్తుందనే ఆశతో చంపేసిందో భార్య. ఈ దారుణ ఘటన నల్గొండలో జరిగింది. పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ ను భార్య అక్సహ్‌ జహ నే హత్య చేసింది.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

murder

ప్రభుత్వ ఉద్యోగం (Government Job) కోసం భర్తను భార్య హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్గొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ కనగల్‌ మండలం పరిధిలోని చర్లగౌరారంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Also Read: Ranya Rao : రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

కొడుకు మృతిపై అనుమానం...

గత నెల 25న మూర్ఛ వచ్చి కిందపడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ఈ మేరకు అతని భార్య అక్సహ్‌ జహ ఫిర్యాదు ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి మహ్మద్ బేగం తన కొడుకు మృతిపై అనుమానం ఉందని చెప్పడంతో అదే రోజు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నెల 7న పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తలకు బలమైన గాయం అయినట్లు తేలింది. దీంతో భార్య అక్సర్‌ జహను అదుపులోకి తీసుకుని విచారించారు. 

Also Read: Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్‌ బాబుపై సంచలన ఫిర్యాదు

2007లో వివాహం (Marriage) జరిగి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మద్యానికి బానిసయ్యాడని, నిత్యం వేధిస్తుండటంతో అడ్డు తొలగించుకోవడంతో పాటు తనకు లేదా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించినట్లు తెలిపింది. దీంతో తలపై కొట్టినట్లు అందువల్లే తను మరణించాడని చెప్పింది. కేసు ఛేదించిన సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై శంకర్‌లను డీఎస్పీ అభినందించారు.

Also Read: Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

Also Read:   Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు