Kalvakuntla Kavitha : కవిత వెనుక ఉన్నది వారేనా?: రంగంలోకి కేసీఆర్!

బీఆర్‌ఎస్‌ పార్టీలో కవిత లేఖ దుమారం రేపుతోంది. దీంతో కవిత వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? అనే విషయంలో పార్టీలో చర్చ సాగుతోందట. కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు రావడమే కాకుండా ఎంక్వైయిరీ కూడా మొదలు పెట్టారట.

New Update
kcr-kavitha-ktr

kcr-kavitha-ktr

Kalvakuntla Kavitha : బీఆర్‌ఎస్‌ పార్టీలో కవిత లేఖ దుమారం రేపుతోంది. 'మై డియర్ డాడీ'  అంటూ రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎల్కతుర్తి సభ తర్వాత రాసిన లేఖగా తెలుస్తున్నప్పటికీ దాన్ని బయటకు ఎవరు లీక్‌ చేశారనే అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. మరోవైపు ఆమె రాసిన లేఖపై ఆటు పార్టీలోనూ ఇటు రాజకీయంగానూ చర్చసాగుతోంది. ఆమె అమెరికా నుంచి వచ్చేసరికి లేఖ లీక్‌ కావడంపై స్పందించిన కవిత... కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయన్నారు. తన నాయకుడు కేసీఆర్ అని.. ఆయన మార్గనిర్దేశకంలోనే ముందుకు వెళ్తామన్నారు.

Also Read :  అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?

అయితే ఈ పరిణామాల మధ్య, పార్టీ అధినేత కేసీఆర్ మౌనం పాటించడమే కాకుండా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు.మరోవైపు హరీష్‌రావు కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో  అసలు బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కేసీఆర్‌తో బేటీ అయిన కేటీఆర్‌ కూడా ఈ విషయంపై స్పందించలేదు.  కాకపోతే పార్టీ శ్రేణులకు, ముఖ్య నాయకులకు అంతర్గతంగా కవిత వ్యవహారం పైన ఎవరు స్పందించవద్దని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి లోని నివాసంలో కెసీఆర్ తో కేటీఆర్ భేటీలో, కవిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల పైన సీరియస్ గానే చర్చించినట్లు సమాచారం.

Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!

కవిత వెనుక పార్టీ సీనియర్లు ఎవరు ఉన్నారనే చర్చ సాగుతోంది. అయితే మొదటినుంచి  కేటీఆర్‌, హరీష్ రావు, కవితల చుట్టే బీఆర్‌ఎస్‌ రాజకీయాలు సాగినప్పటికీ ఫైనల్‌గా మాత్రం కేసీఆర్‌ నిర్ణయమే ఫైనల్‌ అనే సంకేతాలు ఉండేవి.  అయితే గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు చేసిన ఆరోపణల్లాగే కేసీఆర్‌ చుట్టూ ఒక కోటరీ ఉంటుందని వారు ఆయనను కలవకుండా పార్టీ క్యాడర్‌ను, ముఖ్యనేతలను అఖరికి ఎమ్మెల్యేలను కూడా కలవకుండా చేస్తున్నారన్నది కవిత ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఇప్పుడు కవిత చెప్పినదాన్ని బట్టి ఆయన చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు అనే అంశంపై చర్చ సాగుతోంది. పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీలో ఉన్నవారు కూడా నేరుగా కేసీఆర్‌తో మాట్లాడే అవకాశం లేదని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఏదో కారణం చెప్పి వారిని కలవకుండా ఆపుతారన్న ఆరోపణ వినవస్తున్నాయి. కవిత రాసిన లేఖలో పరోక్షంగా ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వచ్చినప్పటికీ కవిత ఒంటరిగా లేఖ రాసేంత సాహసం చేయదని ఆమె వెనుక సీనియర్లు ఎవరో ఉండి ఉంటారన్న ప్రచారం సాగుతోంది.

Also Read: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

కవిత వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? అనే విషయంలోనూ పార్టీలో చర్చ సాగినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. కవితను వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు అనే విషయంలో పార్టీలో ఇప్పటికే ఎంక్వైయిరీ కూడా మొదలు పెట్టారట. కవితను ముందుకు తోచి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రెచ్చ గొట్టేలా ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? లేదా కవిత ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటుందా అనే విషయంలో చర్చ సాగుతోంది. నిజానికి కవిత జాగృతిలో అన్ని తానే అయి ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ సంబంధించిన సీనియర్లు ఎవరూ కూడా జాగృతి కార్యక్రమాల్లో పాల్గొన్నది తక్కువే. ఈ విషయంలో ఇప్పటికే కేటీఆర్‌ పార్టీలో ఉన్న వేగులతో కవిత చుట్టూ ఉన్నవారి వివరాలు సేకరించే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా త్వరలో బీఆర్‌ఎస్‌ లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ సిస్టం

Advertisment
Advertisment
తాజా కథనాలు