/rtv/media/media_files/2025/08/20/producer-dasari-kiran-2025-08-20-21-09-22.jpg)
producer Dasari Kiran
Dasari Kiran: హైదరాబాద్లో సినీ నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకొన్నాడు.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్కు వెళ్తే.. కిరణ్ అనుచరులు15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతకీ దాసరి కిరణ ఎవరంటే? ..ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిలీజైన వ్యూహం సినిమాతో నిర్మాత దాసరి కిరణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా మార్మోగిపోయింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించిన ఆయన ఎక్కువగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తోనే కలిసి సినిమాలు నిర్మించారు. దాసరి కిరణ్ గతంలో తెనాలి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ తర్వా త రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి పలు తెలుగు చిత్రాలను నిర్మించారు. వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి చిత్రంతో కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన హవీష్ హీరోగా వచ్చిన ‘జీనియస్’ సినిమాకు కూడా నిర్మాతగా ఉన్నారు. అలాగే మొగలి రేకులు సీరియల్ నటుడు ఆర్కే సాగర్ తో ‘సిద్ధార్థ్’ అనే మూవీని కూడా నిర్మించారు.
ఆ తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వ్యహం సినిమాను నిర్మించారు. సంచలన దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా పలు వివాదాలు కారణమైంది. ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయనన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో షూటింగ్ పూర్తయ్యాక కూడా చాలా రోజుల పాటు ఈ చిత్రం రిలీజ్ కాలేదు. పోలీస్ కేసులు కూడా నడిచాయి. తీరా అన్ని అవాంతరాలు దాటి థియేటర్లలో రిలీజైన వ్యూహం సినిమా ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దీనికి తోడు ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నడుస్తోంది. ఇంతలోనే దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అవ్వడం గమనార్హం.
హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఆయన వద్ద నుంచి కిరణ్ రూ.4.5కోట్లు అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేశ్ అనేక సార్లు అడిగినా కిరణ్ పట్టించుకోలేదు. ఈనెల 18న విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేశ్, ఆయన సతీమణి వెళ్లారు. అయితే అక్కడ దాసరి కిరణ్ అనుచరులు సుమారు 15 మంది గాజుల మహేష్ దంపతులపై దాడి చేశారు. దీంతో గాజుల మహేశ్ అదే రోజు దాసరి కిరణ్ పై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాసరి కిరణ్ ను హైదరాబాదులో అరెస్టు చేసి విజయ వాడకు తరలించారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 71 మంది సజీవ దహనం!