Miss World 2025 : నేడు వరంగల్ కు అందాల భామలు

ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ ఆదిత్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సుందీమణులు హైదరాబాద్‌ చేరుకున్నారు. కాగా పోటీల్లో భాగంగా నేడు అందగత్తెలంతా వరంగల్‌జిల్లాలో పర్యటించనున్నారు. రామప్ప, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడిలో సందడి చేస్తారు.

New Update

ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ ఆదిత్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సుందీమణులు హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. కాగా పోటీల్లో భాగంగా నేడు అందగత్తెలంతా వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు 109 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఒక బృందంగా, 32 దేశాలకు చెందిన అందాల భామలు మరో బృందంగా  రెండు  వేర్వేరు పర్యటనలు సాగనున్నాయి. ఒక బృందం వరంగల్ ను సందర్శించనుండగా, మరో బృందం రామప్పను సందర్శిస్తుంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా పోలీసుల సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సుందరీమణులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో పాటు బతుకమ్మలతో స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

Miss World 2025

ఈరోజు సాయంత్రం 4.35 నిమిషాలకు ఒక బృందం హనుమకొండ లోని హరితకాకతీయకు చేరుకుంటుంది. అక్కడి నుంచి వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోటలో సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరంగల్‌ కోటలో ఏర్పాటు చేసే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

మరో బృందం రామప్పను సందర్శించనుంది. మొదట రామప్ప సరస్సు వద్ద ఫొటో సెషన్‌లో పాల్గొని  ఆ తర్వాత 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్పమెయిన్‌ గేట్‌ వద్ద వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడంతో పాటు అక్కడి శిల్పకళాసంపదను తిలకిస్తారు. అనంతరం రామప్ప గార్డెన్‌లో ఏర్పాటు చేసిన అలేఖ్య శాస్త్రీయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షిస్తారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రపంచ సుందరీమణులను సన్మానిస్తారు. రాత్రి ఇంటర్‌ప్రిటిషన్‌ సెంటర్‌కు చేరుకుని డిన్నర్‌ చేసి తిరిగి హైదరాబాద్‌ ప్రయాణమవుతారు. కాగా భద్రతా కారణాలతో ప్రపంచ సుందరీమణుల పర్యటన సందర్భంగా భారీ ఎత్తున పోలీసులను మొహరించారు. సుమారు 3 వేల మందితో వారికి రక్షణ కలిపించనున్నారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘా లో వారి పర్యటన సాగనుంది. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

Also Read :  బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్‌తో కలిసి ఏం చేసిందంటే?

1000 pillar temple | ramappa-temple | warangal | Miss World 2025 hyderabad | miss-world

Advertisment
Advertisment
తాజా కథనాలు