/rtv/media/media_files/2025/02/11/8ZVP2gwxVAOZyM8Ve6HW.jpg)
Hyderabad-Vijayawada High Way
తెలంగాణ (Telangana) లో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతర అయిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర (Peddagattu Jatara) రేపు అంటే.. ఈ నెల 16వ దేదీ నుంచి ప్రారంభం కానుంది. అప్పటి నుంచి 20వ తేదీ వరకు జాతర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. జాతర నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే NH-65 పై వాహనాల దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు. 16వ తేదీ ఉదయం నుంచే వాహనాల మళ్లింపు ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఇది కూడా చదవండి: వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!
మళ్ళింపు (1) నార్కట్ పల్లి వద్ద:
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపు గా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా విజయవాడ కు పంపిస్తారు.
మళ్ళింపు (2) కోదాడ వద్ద:
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైదరాబాద్ కు..
మళ్ళింపు (3):
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయరహదారి 365 BB మీదుగా మళ్లిస్తారు.
ఇది కూడా చదవండి: Ramarajyam Raghav Reddy : రామరాజ్యం రాఘవరెడ్డి నెక్ట్స్ టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? వీడియోలు వైరల్
— SP SURYAPET (@spsuryapet) February 11, 2025
Also Read : నేను కొందరికి నచ్చకపోవచ్చు.. ఢిల్లీలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సూర్యాపేట-కోదాడ వెళ్లే వాహనాల మళ్ళింపు:
కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే RTC బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలను SRSP కెనాల్ నుంచి బీబీగుడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపిస్తారు. సూర్యాపేట పట్టణం నుంచి కోదాడ వెళ్లే RTC బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయరహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపిస్తారు.
Also Read : వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!
దురాజుపల్లి పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్తు ఏర్పాట్లు. 2000 మంది పోలీసులతో బందోబస్తుతో పటిష్ట భద్రత. 68 సీసీ కెమెరాలు ఏర్పాటు, నిరంతర నిఘా. దొంగతనాల నివారణకు స్పెషల్ టీమ్స్. మహిళల రక్షణకు షీ టీమ్స్ సిబ్బంది. జాతర ప్రాంగణంలో బెట్టింగ్ లు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు. pic.twitter.com/Ul5PzdQ77U
— SP SURYAPET (@spsuryapet) February 12, 2025