/rtv/media/media_files/2025/05/06/zWZxhPJcGkPzPIb5eW2B.jpg)
facebook photos
Hyd New IT Park: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు వివాదాస్పదం కావడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. ఐటీ పార్క్ కోసం శేరిలింగంపల్లి గోపన్పల్లిలో భూసేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిషేధిత జాబితాలో 439.15 ఎకరాలు..
ఈ మేరకు పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (TGIIC) ఏర్పాటు చేసే ఐటీ పార్కు నిర్మించనుంది. దీంతోపాటు ఇతర పార్కుల కోసం భూసేకరణ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. పలు సర్వే నంబర్లను రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేరిలింగంపల్లి ఆర్డీవోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో గోపన్పల్లిలోని సర్వే నంబర్ 127, 173, 263, 286 సర్వే నంబర్ల పరిధిలోవున్న 439.15 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. మరికొన్ని రోజుల్లో భూసేకరణకు నోటిఫికేషన్ కూడా విడుదలకానున్నట్లు సమాచారం.
Also Read: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్
ఇటీవల ఆ 400 ఎకరాల భూమి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకొని అక్కడి కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ వ్యవహారంపై 5 ప్రశ్నలు సందిస్తూ.. ఏప్రిల్ 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. ఈ భూమి ఎప్పుడూ కూడా అటవీ రికార్డుల్లో లేదని చెప్పింది.
Also Read: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..
hyderabad | gachibowli | today telugu news