/rtv/media/media_files/2025/06/21/thummala-nageswara-rao-2025-06-21-19-55-33.jpg)
Thummala nageswara rao
తెలంగాణలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి రూ.7,770.83 కోట్ల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు నిధుల విడుదల కొన్ని నెలల పాటు జరిగేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. అత్యవసర సేవలకు కొత్త నెంబర్ ఇదే
మేము రైతు భరోసా నిధులు వేగంగా ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ORR లోపల సాగు భూములు గుర్తించి వాటికి రైతు భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. సాగు చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసా చెల్లిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీని ఎన్నేళ్లో చేసిందో గుర్తు చేసుకోవాలని సెటైర్లు వేశారు.
Also Read: సంచలన అప్డేట్.. ఇరాన్లో భూకంపం రావడానికి కారణం అదే !