Telangana: తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. ఇకనుంచి రెండుసార్లు !

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. ప్రతినెల మొదటి, మూడో శనివారం కేబినెట్‌ మీటింగ్‌ జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. ప్రతినెల మొదటి, మూడో శనివారం కేబినెట్‌ మీటింగ్‌ జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను అమలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఈ సమావేశాల్లో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. విధానపరంగా నిర్ణయాల్లో వచ్చిన గ్యాప్‌ను ఫుల్‌ఫిల్‌ చేసేందుకు నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 17 సార్లు కేబినేట్ సమావేశాలు జరిగాయి.

Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం

మరోవైపు తాజాగా నిర్వహించిన కేబినెట్‌ మీటింగ్‌లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించాలని డిసైడ్ అయింది. రాష్ట్ర అభివృద్ధితో పాటూ ప్రజల సంక్షేమం పై దృష్టి సారించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించింది. ఇందులో ఒకటి వెంటనే ఇవ్వాలని...రెండోది ఆరు నెలల తర్వాత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని కలిగించనుంది. అలాగే మహిళా స్వయం సహాయ బృందాల సభ్యలకు ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపుల కోసం రూ. 70 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Also Read: ట్రంప్ తో గొడవ..టెస్లా షేర్లు ఢమాల్..రూ.13 లక్షల కోట్లు ఆవిరి

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆరోగ్య కార్డులను కూడా జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఉద్యోగులు రూ. 500 చొప్పున జమ చేస్తే...అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చిన మొత్తాన్ని జమ చేసి ఆరోగ్య బీమా కింద మంజూరు చేస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణపై కూడా కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. మెట్రో సేవలను నగరంలో మరింత విస్తృతం చేయడం దానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చ చేశారు. అలాగే ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భట్టి చెప్పారు. 

telugu-news | telangana | rtv-news | cabinet-meeting

Advertisment
Advertisment
తాజా కథనాలు