/rtv/media/media_files/2025/01/04/UITzfDPLkYgwo7qQ5yCh.jpg)
Telangana Cabinet
Telangana: తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన రిపోర్టు ఖరారైంది. 700 పేజీలతో కూడిన రిపోర్ట్ను డెడికేషన్ కమిషన్ చీప్ బూసాని వెంకటేశ్వర్లు సీఎస్ శాంతి కుమారికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామవార్డు నుంచి జడ్పీ చైర్మన్ దాకా సెగ్మెంట్లవారిగా రిజర్వేషన్లు పంచాయితీ రాజ్ శాఖ అమలు చేయనుంది.
రాష్ట్రాన్ని ఓ యూనిట్గా..
అయితే ఈ నివేదికను సీఎస్ శాంతకుమారీ బీసీ సంక్షేమ శాఖకు పంపనున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గ్రామం ఒక యూనిట్గా వార్డు సభ్యుల రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోనున్నారు. మండలం ఒక యూనిట్గా ఎంపీటీసీల రిజర్వేషన్లు వర్తిస్తాయి.
జిల్లా ఒక యూనిట్గా జడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాష్ట్రాన్ని ఓ యూనిట్గా తీసుకుని జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనుంది.
ఇది కూడా చదవండి: CRIME NEWS: మా తమ్ముడితో సంబంధం పెట్టుకుంటావా?.. అక్క ఎంత దారుణంగా చంపిందంటే..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయించిన సమగ్ర కుల గణనపై ఒకవైపు ప్రతిపక్షాలు, బీసీ కుల సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. గురువారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని స్పష్టం చేశారు.