TG News: కేంద్రం కులగణన నిర్ణయంపై రేవంత్ సంచలన ప్రెస్ మీట్!
దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని కోరారు.
TG News: దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని నిర్ణయించినందుకు ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని కోరారు. తెలంగాణలో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 97 శాతం కులగణన పూర్తి చేశామని, మిగిలిన 3 శాతం మందికి మరో అవకాశం కూడా ఇచ్చామని చెప్పారు.
మాట నిలబెట్టుకున్నాం..
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ప్రజలు, ప్రజా ప్రతినిథులు పాల్గొని తెలంగాణలో కులగణన విజయవంతం చేశామన్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలని తీర్మాణం చేశాం. ఢిల్లీ జంతర్ మంతర్ లో కులగణన కోసం ధర్నా చేశాం. ప్రధాని మోదీ తీసుకున్న జనగణనలతో కులగణను చేరుస్తామనే నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే దీనిని ఎప్పుడు మొదలు పెడుతున్నారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సివిల్ సోసైటీలతో చర్చించాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను తెలుసుకుని, సమాచారం సేకరించి విధివిధానాలను నిర్ణయించాలన్నారు. ప్రజలనుంచి సూచనలు తీసుకోవాలని చెప్పారు రేవంత్.
ఇక తెలంగాణలో 57 ప్రశ్నా పత్రాలను తయారు చేసి కులగణన చేశామని, కేంద్రం కూడా ప్రశ్నాప్రతాలను తయారు చేసుకోవాలని చెప్పారు. ఒకే పార్టీ విధానం, కొద్ది మంది వ్యక్తుల విధానంగా దీనిని అమలు చేయకూడదన్నారు. తెలంగాణ రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి నేర్చుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మేధావులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. దీనిని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యా, ఉద్యోగాల్లో అందరికీ న్యాయం జరగాలన్నారు. 11 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నారు. పదికిపైగా బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ కులగణన చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. దీనిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, అంతిమంగా బలహీన వర్గాలకు మేలు జరగాలని ఆశించారు.
జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారు. రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో రెండు తీర్మాననాలు చేసి కేంద్రానికి పంపాం జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపించాం. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టాం. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పారు.
తెలంగాణలో మేము 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించాం. కులగణనలో మేం అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశాం ఎక్కడా మా పార్టీ కార్యక్రమంలా చేయలేదు. అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన పూర్తి చేశాం అందుకే కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కులగణనలో దేశానికి తెలంగాణ ఓక మోడల్ గా నిలిచింది. కులగణనపై కేంద్రంతో మా అనుభవాన్ని పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే మా సంకల్పం రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం కులగణన చేసి చూపించింది. మమ్మల్ని విమర్శించే బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నా.. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదు? రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే మా పై విమర్శలు చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులలో అసూయ, అసంతృప్తి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోంది. తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అన్నారు.
TG News: కేంద్రం కులగణన నిర్ణయంపై రేవంత్ సంచలన ప్రెస్ మీట్!
దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని కోరారు.
Telangana CM Revanth interesting comments on central government caste census announcement
TG News: దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని నిర్ణయించినందుకు ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని కోరారు. తెలంగాణలో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 97 శాతం కులగణన పూర్తి చేశామని, మిగిలిన 3 శాతం మందికి మరో అవకాశం కూడా ఇచ్చామని చెప్పారు.
మాట నిలబెట్టుకున్నాం..
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ప్రజలు, ప్రజా ప్రతినిథులు పాల్గొని తెలంగాణలో కులగణన విజయవంతం చేశామన్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలని తీర్మాణం చేశాం. ఢిల్లీ జంతర్ మంతర్ లో కులగణన కోసం ధర్నా చేశాం. ప్రధాని మోదీ తీసుకున్న జనగణనలతో కులగణను చేరుస్తామనే నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే దీనిని ఎప్పుడు మొదలు పెడుతున్నారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సివిల్ సోసైటీలతో చర్చించాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను తెలుసుకుని, సమాచారం సేకరించి విధివిధానాలను నిర్ణయించాలన్నారు. ప్రజలనుంచి సూచనలు తీసుకోవాలని చెప్పారు రేవంత్.
Also Read: ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, అర్హతల వివరాలివే!
ఇక తెలంగాణలో 57 ప్రశ్నా పత్రాలను తయారు చేసి కులగణన చేశామని, కేంద్రం కూడా ప్రశ్నాప్రతాలను తయారు చేసుకోవాలని చెప్పారు. ఒకే పార్టీ విధానం, కొద్ది మంది వ్యక్తుల విధానంగా దీనిని అమలు చేయకూడదన్నారు. తెలంగాణ రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి నేర్చుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మేధావులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. దీనిని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యా, ఉద్యోగాల్లో అందరికీ న్యాయం జరగాలన్నారు. 11 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నారు. పదికిపైగా బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ కులగణన చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. దీనిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, అంతిమంగా బలహీన వర్గాలకు మేలు జరగాలని ఆశించారు.
Also Read: India: పాక్ విమానాల నావిగేషన్ జామ్..ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతో భారత్ యుద్ధం
జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారు. రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో రెండు తీర్మాననాలు చేసి కేంద్రానికి పంపాం జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపించాం. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టాం. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పారు.
తెలంగాణలో మేము 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించాం. కులగణనలో మేం అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశాం ఎక్కడా మా పార్టీ కార్యక్రమంలా చేయలేదు. అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన పూర్తి చేశాం అందుకే కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కులగణనలో దేశానికి తెలంగాణ ఓక మోడల్ గా నిలిచింది. కులగణనపై కేంద్రంతో మా అనుభవాన్ని పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే మా సంకల్పం రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం కులగణన చేసి చూపించింది. మమ్మల్ని విమర్శించే బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నా.. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదు? రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే మా పై విమర్శలు చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులలో అసూయ, అసంతృప్తి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోంది. తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అన్నారు.
cast survey | pm modi | cm revanth | telugu-news | today telugu news