TG News: క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్.. రూ.12ల‌క్షలు అంద‌జేత‌!

క్యాన్సర్ బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచ‌ర‌ణ్ చికిత్సకు రూ.12 లక్షల ఆర్థిక స‌హాయం అందించారు. చికిత్స అనంతరం సాయి కుటుంబ స‌భ్యులు ముఖ్యమంత్రిని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలిపారు. 

New Update
cm revanth canecr

cm revanth canecr Photograph: (cm revanth canecr)

TG News: క్యాన్సర్ బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచ‌ర‌ణ్ (35) చికిత్సకు ఆర్థిక స‌హాయం అందించారు. అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్‌)తో బాధపడుతున్న సాయికి రూ.12 లక్షలు అందజేశారు. ఆయ‌న‌ భార్య లక్ష్మిప్రస‌న్న, కుమార్తెలు ల‌క్ష్మి సుస‌జ్ఞ (6), స్మయ (2 నెల‌లు), త‌ల్లిదండ్రులు రాము, సునీతలకు ధైర్యంగా ఉండాలని చెప్పారు.

ఇళ్లు అమ్మిన సరిపోలేదు..

ఇంటికి ఆధార‌మైన సాయిచ‌ర‌ణ్ క్యాన్సర్ బారిన‌ప‌డ‌డంతో అత‌ని చికిత్సకోసం కుటుంబ స‌భ్యులు త‌మ ఇంటిని అమ్మేశారు. అయిన‌ప్పటికీ స‌రిపోక‌పోవ‌డంతో ముఖ్యమంత్రిని గ‌తంలో క‌లిసి త‌మ ఇబ్బందుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. దీంతో వెంటనే చ‌లించిన రేవంత్ రెడ్డి.. సాయిచ‌ర‌ణ్ చికిత్సకు రూ.5 ల‌క్షలు మంజూరు చేశారు. దాంతో హైద‌రాబాద్ బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుప‌త్రిలో సాయిచ‌ర‌ణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేశారు.

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

చికిత్సకు అద‌నంగా మ‌రో రూ.7 ల‌క్షల‌ను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాల‌ని ఆదేశించ‌డంతో ఆ మొత్తాన్ని అధికారులు అంద‌జేశారు. చికిత్స చేయించుకున్న సాయిచ‌ర‌ణ్  కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర స‌చివాల‌యానికి వ‌చ్చి ముఖ్యమంత్రిని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఆహారంపై నిమ్మరసం ఎందుకు వెసుకుంటారో తెలుసా..? ఆరోగ్య రహస్యం ఇదే


 cm revanth | cancer | patient | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు