/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మద్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అజారుద్దీన్తో పాటుగా ఇంకెవరైనా మంత్రులుగా ప్రమాణం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
రాష్ట్ర కేబినెట్లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, మైనారిటీ ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఈ హడావుడి మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రేపు 12.15 కి రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
— RTV (@RTVnewsnetwork) October 30, 2025
మంత్రులకు అందిన ఆహ్వాన లేఖలు pic.twitter.com/RrzzhTSfHa
Also Read : అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్? రంగంలోకి ఈసీ!
బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు
అయితే ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అజారుద్దీన్కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మైనార్టీ సంక్షేమం, క్రీడలు లేదా హోం శాఖ వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అజారుద్దీన్తో పాటుగా కేబినేట్ లో మరో ఇద్దరికి చోటు ఉంది. ఇందులో ఓసీ, బీసీలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..ఆ ప్రాంతాల్లో పర్యటన..అధికారులకు ఆదేశాలు
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us