/rtv/media/media_files/2025/01/27/TP8zcxp21XiT7XG8VO7O.jpg)
phone taping case Photograph: (phone taping case)
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న 10 నెలలుగా ఫోన్ట్యాపింగ్ కేసులో విచారణకు జైలులో ఉన్నారు. ఈ కేసులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడంతో ఇకపై తిరుపతన్న జైల్లో ఉంటాల్సిన అవసరం లేదని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈమేరకు తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృతి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?
కొంతమంది కీలక సాక్ష్యులను ఇంకా విచారించాల్సి ఉందని ఈక్రమంలో బెయిల్ మంజూరు చేయద్దని ఆయన వాదించారు. ఇంకా ఈ కేసు విచారణకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలంగాణ రాష్ట్రం తరుపు న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. రాజకీయ నాయకుల ఆదేశాలతో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఆయన ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ట్రయల్కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయోద్దని షరతులతో సుప్రీం కోర్టు తిరుపతన్నకు బెయిల్ ఇచ్చింది.
Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?