/rtv/media/media_files/2025/02/17/L5rsaL5EHg8QUPQOOWPr.jpg)
CM Revanth Reddy
తెలంగాణలో మార్చి మొదటి వారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజులపాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. అందుకోసం రెండోసారి కూడా కులగణన సర్వే నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి కులగణన సర్వేలో పాల్గొన వారి కోసం ఫిబ్రవరి 26 వరకు మళ్లీ సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తైన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని కేబినెట్ చర్చించనుంది.
Also Read : Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
Also Read : అబ్బే బర్డ్ ఫ్లూను పట్టించుకోవట్లే..భారీగా పెరిగిన చికెన్ ధరలు
Assembly Sessions - Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై చట్టాలు చేయడానికి త్వరలో అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నారు. మార్చి 10 ముఖ్యమంత్రితోపాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు, మంత్రి వర్గ విస్తరణ, పార్టీ బలోపేతం గురించి అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : సీఎం రేఖా గుప్తాతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీళ్లే!
Also Read : కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!