ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. తెలంగాణ ఏపీ మధ్య ఈ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.ఇది కూడా చదవండి: అనకాపల్లి టూ ఆనందపురం హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ రైళ్ల వివరాలు.. Train No.07653: కాచిగూడ-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్లను ఈ నెల 8, 11 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్లు ఆయా తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యానికి చేరుకుంటాయి.Train No.07654: కాకినాడ టౌన్-కాచిగూడ ట్రైన్లను ఈ నెల 10, 12 తేదీల్లో నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సాయత్రం 5.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు గమ్యానికి చేరుకుంటాయి.ఇది కూడా చదవండి: AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు ఈ నాలుగు రైళ్లు మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. SCR to run Sankranti Special Trains @drmsecunderabad @drmgnt pic.twitter.com/agqBjEEExA — South Central Railway (@SCRailwayIndia) January 1, 2025 Train No.07023: హైదరాబాద్-కాకినాడ టౌన్ ట్రైన్ ను ఈ నెల 10న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 18జ30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 7.10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.Train No.07024: ఈ నెల 11న ఈ ట్రైన్ ను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ ట్రైన్ రాత్రి 8 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.