Rajasingh : రాజాసింగ్‌కు షాక్‌.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్‌

ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

New Update
Rajasingh

Rajasingh

Rajasingh: ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం.. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం... అందుకే ఆయనకు ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయనకు సంబంధించిన రెండు ఫేస్ బుక్ పేజీలు, మూడు ఇన్ స్టా అకౌంట్లను తొలిగిస్తూ మెటా నిర్ణయం తీసుకుంది.

Also Read :  మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!

బీజేపీలో వివాదస్పద నేతగా పేరున్న రాజాసింగ్ హిందూ దేవాలయాలు, దేవుళ్ల పేరుతో సభలు, సమావేశాల్లో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తాడని పేరుంది. సోషల్ మీడియాలోనూ ఇతర వర్గాల పట్ల తనకున్న ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటాడు. అనేక సందర్భాల్లోనూ ఇతర మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు ఆయన పై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. బీజేపీ లోనూ ఆయన సంస్థాగత లోపాలను ఎత్తి చూపి అగ్రనాయకత్వం చేత క్రమశిక్షణ చర్యలకు గురయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఒకసారి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. అయినా తన దూకుడు మాత్రం తగ్గించుకోలేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఇతర మతాల విమర్శిస్తూ వీడియోలు, పోస్టులు పెడుతుంటాడని పలువురు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మెటా చర్యలు చేపట్టింది.  

Also Read :  మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తొలగింపు..  

సోషల్‌ మీడియాలో ధ్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్‌ ల్యాబ్‌ (IHL) వెల్లడించిన నివేదికలో తెలిపింది. నివేదిక వెల్లడించిన వారం తర్వాత మెటా ఈమేరకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. తొలగించిన ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో సుమారు 10 లక్షల మందికిపైగా సభ్యులు ఉండగా, ఇన్‌స్టా అకౌంట్లలో లక్షా 55 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.


 Also Read :  నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!


నిజానికి 2020లోనే రాజాసింగ్ సంబంధించిన  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లపై నిషేధం విధించింది. అయితే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు. మద్దతుదారులు కొత్త మార్గాల ద్వారా గ్రూపులు, పేజీలను తిరిగి సృష్టించారు. వాటిలో ఎప్పటికప్పుడు రాజాసింగ్‌కు చెందిన ప్రసంగాలు, కార్యాకలాపాలకు సంబంధించిన వివరాలు షేర్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన రెచ్చగొట్టేలా పెట్టిన కొన్ని పోస్టులే నిషేధానికి కారణమని తెలుస్తున్నది.

Also Read :  Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృ‌తి

Also Read:Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

Advertisment
Advertisment
తాజా కథనాలు