Tg news : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ

రాష్ట్రంలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో శిఖా గోయల్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు.

New Update
Telangana Police

Telangana Police

Tg news : రాష్ట్రంలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో శిఖా గోయల్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు. చారుసిన్హాకు మహిళా భద్రత విభాగం,సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు అప్పగించారు.

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
 
హైదరాబాద్‌ సిటీ ఎస్‌బీ డీసీపీగా ఉన్న ఎస్‌.చైతన్యకుమార్‌ను సౌత్‌ఈస్ట్ జోన్‌ డీసీపీగా నియమించగా, ఆ పదవిలో ఉన్న పాటిల్‌ కాంతిలాల్‌ సుభాష్‌ను కొమురంభీం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్‌లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తఫ్సీర్‌ ఇక్బాల్‌ను చార్మినార్‌ రేంజ్‌ జోన్‌ డీఐజీగా నియమించారు. డీవీ శ్రీనివాసరావును మెదక్‌ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న అభిలాష్‌ బిస్త్‌ను తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు. వీరితో మరో కొంతమందిని కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్

Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..

Advertisment
Advertisment
తాజా కథనాలు