/rtv/media/media_files/2025/06/06/hnHfBMAL4bqJKQqjpizN.jpg)
Telangana Rain update Photograph: (Telangana Rain update)
రానున్న నాలుగురోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రానన్న నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
Heavy Rain Alert
కాగా సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కూడా ఈ జిల్లాలకు తోడు నిజామాబాద్ లోనూ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read : ఇరాన్పై అమెరికా సైనిక దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తున్నాం
ఇక ఏపీలో రుతుపవనాలు మందగించడంతో ఆకాశం మేఘావృతమై ఉన్నా.. వాతావరణం మాత్రం వేడిగా ఉండే అవకాశం ఉంది. వేడితో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో పగలు ఎండ ఎక్కువగా ఉండి, రాత్రికి వర్షం కురుస్తోంది. ఇక ఈ రోజు శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: హోటల్లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
Also Read : ‘శక్తిమాన్’ సినిమాలో అల్లు అర్జున్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్
telangana-rains | telangana rains update | telangana rains today | telangana rain alert | telangana-rain | heavy rain alert to ap | ap rain alert