/rtv/media/media_files/2025/01/05/K9NEOVIiEGsm2aChcYrE.jpg)
oyo rooms
TG Crime: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా ఓయో గదులను ఏర్పాటు చేయడంతో పాటు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. బోయినపల్లి ఇన్ స్పెక్టర్ తిరుపతి రాజు,ఎస్సై నాగేంద్ర బాబు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి బాపూజీనగర్ లో ఉన్న సప్తమి గ్రాండ్ హోటల్ పైన ఉన్న గదులను కొంతమంది వ్యక్తులు అనుమతులు లేకుండా ఓయో గదులుగా ఏర్పాటు చేశారు.
కాగా ఈ గదులను సంజీవ్ కుమార్ అద్దెకు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా పింకీ దాస్, షైక్ సెబారుద్దీన్ అనే వ్యక్తులు లాడ్జిలో పనిచేస్తున్న సంజీవ్ కుమార్ యాదవ్ కు ఆశ చూపి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఓయో లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిర్వాహకులతో పాటు ఓ విటుడు, మరో మహిళ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిర్వాహకులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల కర్కశం.. వీడియో వైరల్