/rtv/media/media_files/2025/05/30/pVPQbRnyLYwxWgNokAmj.jpg)
Mumbai Indians VS Gujarat Titans
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్ స్టో (47), సూర్య (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. మరీ గుజరాత్ టైటాన్స్ ఈ భారీ స్కోర్ చేస్తుందా ? లేదా ? అని వేచి చూడాలి. ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్కు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్తో తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిచిన టీమ్.. ఫైనల్స్లో ఆర్సీబీతో ఆడాల్సి ఉంటుంది.
Also Read: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని మోదీ
మరోవైపు రోహిత్ శర్మ ఈ సీజన్లో రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో మొత్తం 7 వేల పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా అరుదైన రికార్డు సాధించాడు.
Also Read: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్
Gujarat Titans | mumbai-indians | rtv-news