MI vs GT: ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్.. గుజరాత్‌ కొట్టగలదా ?

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. 

New Update
Mumbai Indians VS Gujarat Titans

Mumbai Indians VS Gujarat Titans

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌ స్టో (47), సూర్య (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టాడు. మరీ గుజరాత్‌ టైటాన్స్ ఈ భారీ స్కోర్‌ చేస్తుందా ? లేదా ? అని వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌కు క్వాలిఫైయర్‌ 1లో ఓడిపోయిన పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిచిన టీమ్‌.. ఫైనల్స్‌లో ఆర్సీబీతో ఆడాల్సి ఉంటుంది.

Also Read: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని మోదీ

మరోవైపు రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్‌లో మొత్తం 7 వేల పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. 

Also Read: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్

Gujarat Titans | mumbai-indians | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు