/rtv/media/media_files/2025/06/20/dk-aruna-sensational-allegation-2025-06-20-18-36-01.jpg)
DK Aruna's sensational allegation
D K Aruna : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ చేశారు. ఈ రోజు ఆర్టీవీతో మాట్లాడిన అరుణ తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఐ ఫోన్ కంపెనీ వారు తనను అలెర్ట్ చేశారన్నారు. దీంతో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అరుణ వివరించారు. నా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని డీకే అరుణ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. బీజేపీ ఆఫీస్ లో పని చేసే సిబ్బంది ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. అమెరికాపై ఇరాన్ సంచలన ప్రకటన!
ఇక బనకచర్ల ప్రాజెక్ట్ పై స్పందిస్తూ....బనకచర్ల ప్రాజెక్ట్ పై బీ అర్ ఎస్ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. బీ అర్ ఎస్ పార్టీ సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీ అర్ ఎస్ చేసిందేంటి? అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ ఎన్డీఏ పార్టనర్ కాబట్టి కాంగ్రెస్ బీజేపీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ కు అన్యాయం జరగనివ్వనని కేంద్ర జలశక్తి మంత్రి క్లియర్ గా చెప్పారన్నారు. తొందర్లోనే ఇద్దరు cm ల భేటీ ఉంటదని ఆశిస్తున్నట్లు డీకే అరుణ తెలిపారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
మరోవైపు అలంపూర్లో రైతులకు బేడీలు వేసిన ఘటనపై కూడా అరుణ స్పందించారు. రైతులకు బేడీలు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులతో చర్చించి ఇథనాల్ ఫ్యాక్టరీ రాదని వారికి భరోసా ఇవ్వాలన్నారు. రైతులను ఎవరి ఒత్తిడి తో అరెస్ట్ చేశారో తెలపాలన్నారు. Cm రైతులను పిలిపించి మాట్లాడాలని సూచించారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం