Kavitha: కవిత కొత్త జాగృతి ఆఫీసు ఎలా ఉందో చూశారా ?

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం తన ఇంటికి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్‌ను ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్‌ చేయనున్నారు. రెండంతస్తుల్లో ఉన్న ఆ బిల్డింగ్ ఎంట్రన్స్‌లో కేసీఆర్‌ ఫొటో ఉంది.అలాగే ప్రొ. జయశంకర్, తెలంగాణ తల్లి, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి.

New Update

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం జాగృతి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. తన ఇంటికి సమీపంలోనే ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్‌ చేయనున్నారు. జైలు నుంచి వచ్చాక బీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండానే ప్రజల్లోకి వచ్చిన కవిత కొత్త ఆఫీసును ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండంతస్తుల్లో ఆ బిల్డింగ్ ఉంది. ఆఫీసులోకి వెళ్లగానే ఎంట్రన్స్‌లో కేసీఆర్‌ ఫొటో ఉంది. మరోవైపు కవిత ఫొటో ఉంది. అలాగే ప్రొ. జయశంకర్, తెలంగాణ తల్లి, బీఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలు ఉన్నాయి. 

Also Read: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం

గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి సమాంతరంగా జాగృతి నడిచింది. దానికి జాతీయ అధ్యక్షురాలిగా కవితనే ఉన్నారు. ఇటీవల లిక్కర్‌ స్కామ్‌ కేసులో జైలు నుంచి విడదలైన ఆమె మళ్లీ జాగృతికి మరింత దగ్గరయ్యారు. ఇటీవలే కొత్త జాగృతి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్‌ కుటుంబంలో కేటీఆర్, కవిత మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె కేసీఆర్‌కు పంపించిన లేఖ లీక్‌ కావడం సంచలనం రేపింది. తాజాగా ఆమె కొత్తగా తెలంగాణ జాగృతి ఆఫీస్‌ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు కేసీఆర్‌ తనకు దేవుడు లాంటివాడని అంటూనే మరోవైపు పరోక్షంగా కేటీఆర్‌ను కవిత టార్గెట్‌ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.  

Also Read: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ

ఇటీవలే తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం(BRS Merged into BJP) చేయొద్దనేది తన వాదన అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తను జైల్లో ఉన్న సమయంలోనే బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలుపుతామని చెప్పారని కవిత అన్నారు. కాగా బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు