/rtv/media/media_files/2026/01/26/rajasingh-2026-01-26-09-40-42.jpg)
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది. ఆసిఫ్ నగర్కు చెందిన అబ్దుల్ హఫీజ్ అనే పేరుతో ఈ లేఖ అందినట్లు సమాచారం. గతంలోనూ రాజాసింగ్కు అనేకమార్లు విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు నేరుగా లేఖ రావడం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది.
నన్ను నువ్వు ఏమీ చేయలేవు
ఆ లేఖలోని సారాంశం అత్యంత ఘాటుగా, సవాలు విసిరేలా ఉంది. "నాకు పోలీసుల మద్దతు ఉంది.. నన్ను నువ్వు ఏమీ చేయలేవు" అంటూ నిందితుడు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, బాంబు పెట్టి ఎమ్మెల్యేను లేపేస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ లేఖ ఎమ్మెల్యే అందిన వెంటనే ఆయన అనుచరులు, భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
వరుసగా వస్తున్న ఈ బెదిరింపులపై రాజాసింగ్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పదే పదే ఇలాంటి హెచ్చరికలు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేఖ పంపిన వ్యక్తి వివరాలను సేకరించేందుకు ఆసిఫ్ నగర్ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎమ్మెల్యే భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.
Follow Us