Raithu Bharosa: 15 ఎకరాల వరకు నేడు రైతుభరోసా నిధులు.. మంత్రి కీలక ప్రకటన

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. 15 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి సోమవారం రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో రూ.513.83 కోట్లు నిధులు విడుదలవుతాయని తెలిపారు.

New Update
Minister thummala nageshwar rao

Minister thummala nageshwar rao

తెలంగాణలో రైతు భరోసా నిధులు జమ చేసే ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. 15 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి సోమవారం రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో రూ.513.83 కోట్లు నిధులు విడుదలవుతాయని తెలిపారు. ఇప్పటిదాకా 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,274 కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నారు.  

Also Read: అలా చేస్తే BJP కార్యకర్తలే మమ్మల్ని బట్టలిప్పి కొడతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్

శనివారం 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి రూ.7,770.83 కోట్ల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుబంధు నిధుల విడుదల కొన్ని నెలల పాటు జరిగేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. మేము రైతు భరోసా నిధులు వేగంగా ఇస్తుంటే బీఆర్ఎస్‌ నేతలు మాత్రం డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ORR లోపల సాగు భూములు గుర్తించి వాటికి రైతు భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. సాగు చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసా చెల్లిస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీని ఎన్నేళ్లో చేసిందో గుర్తు చేసుకోవాలని సెటైర్లు వేశారు. 

Also Read: సొంత రాష్ట్రంలో మోదీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో BJP ఘోర ఓటమి

ఇదిలాఉండగా రాష్ట్రంలో రేషన్‌కార్డుల ఏరివేతపై కూడా కసరత్తు సాగుతోంది. లబ్ధిదారుల్లో అనర్హులున్నారన్న నేపంతో పలువురి రేషన్‌ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అనుమానాస్పద రేషన్‌ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గడచిన 6 నెలలుగా ఎవరైతే రేషన్‌ తీసుకోలేదో వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారి పరిశీలన ప్రకారం  లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులున్నారని లెక్క తేల్చింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు