సొంత రాష్ట్రంలో మోదీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో BJP ఘోర ఓటమి

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని విసవదార్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిపై ఆప్‌ అభ్యర్థి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సాధించారు.

New Update
Visavadar assembly bypoll

ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని విసవదార్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిపై ఆప్‌ అభ్యర్థి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లూథియానా (పంజాబ్)‌, కాళీగంజ్‌ (పశ్చిమబెంగాల్)‌, కాడి, విసవదార్‌ (గుజరాత్‌), నీలంబూర్‌ (కేరళ) స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 

జూన్ 23(నేడు) ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో విసవదార్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌పై 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో విసవదార్‌ నుంచి గెలుపొందిన ఆప్‌ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

Advertisment
తాజా కథనాలు