/rtv/media/media_files/2025/06/21/lady-aghori-wife-sri-varshini-missing-2025-06-21-13-18-25.jpg)
Lady Aghori wife Sri Varshini Missing
Sri Varshini Missing: అఘోరీ అలియాస్ శ్రీనివాస్ భార్య శ్రీ వర్షిణి(Aghori Sri Varshini ) కనిపించడం లేదు. ఆమె నిన్ననే (శుక్రవారం)- గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిలీజ్ అయింది. అనంతరం అక్కడ నుంచి ఎటువైపు వెళ్లిందో తెలియలేదు. విజయవాడలోని ఇంటికి తాళం వేసి ఉండటంతో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ తన ఇంటికి వెళ్లకపోతే.. మంచిర్యాలలోని అఘోరీ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
Sri Varshini Missing
ఆమె గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూసింది. మరోవైపు వర్షిణిని తలుచుకుంటూ అఘోరీ శ్రీనివాస్ జైళ్లోనే ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు వర్షిణిని చూపించాలంటూ ఏడుస్తున్నాడు. ఈ తరుణంలో వర్షిణీ మిస్సింగ్ కావడం సంచలనంగా మారింది.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
45 రోజులుగా జైల్లో అఘోరీ
గత ఏడాది నుంచి లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సనాతన ధర్మం అంటూ.. మహిళలపై జరుగుతున్న అఘోయిత్యాల కోసం తాను పోరాడుతానని ఏపీ, తెలంగాణలో తెగ తిరిగేశాడు. ఆ సమయంలో పలువురితో గొడవలకు దిగాడు. అక్కడితో ఆగకుండా పోలీస్ అధికారులపై సైతం దాడులు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.
వర్షిణీని ప్రేమించి పెళ్లి
ఎప్పుడైతే వర్షిణీతో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి అఘోరీ జీవితం పూర్తిగా మారిపోయింది. వర్షిణీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే మరో మహిళ అతడిపై కేసు వేసింది. తానే మొదటి భార్యనని రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం సంచలనం రేపింది. అది మాత్రమే కాకుండా ఓ సినిమా ప్రొడ్యూసర్ సైతం అఘోరీపై కేసు వేసింది.
పూజలు పేరుతో తనను బెదిరించి రూ.10 లక్షలు తీసుకున్నాడని కేసు వేయడంతో పోలీసులు అఘోరీని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైల్లోనే ఉంచారు. ఇటీవలే మోకిలా, కొమురవెళ్లి కేసుల్లో అఘోరీకి బెయిల్ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే ఉంచారు. అఘోరీతో పాటు వర్షిణీని గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టగా నిన్న రిలీజ్ అయింది.