/rtv/media/media_files/2025/06/19/periods-2025-06-19-21-44-49.jpg)
నెలసరి సమయంలో మహిళలు ఎక్కువగా శానిటరీ ప్యాడ్లు వాడుతుంటారు. అయితే వీటిని ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. వీటిని ఎక్కువ సమయం ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నెలసరి సమయంలో మహిళలు తప్పకుండా జాగ్రత్త పాటించాలి.
ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
ఎక్కువగా పాడ్స్ను వాడటం వల్ల..
చాలా మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. కానీ వీటి కంటే టాంపూన్లు, మెన్స్ట్రువల్ కప్పులు బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడటం వల్ల ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం ప్యాడ్లు వాడితే దురద, దద్దుర్లు వంటివి వస్తాయి.
ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!
అదే టాంపూన్లు, మెన్స్ట్రువల్ కప్పులు అయితే ఆ సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే టాంపూన్లు కంటే మెన్స్ట్రువల్ కప్పులు బెటర్. వీటిని కొన్నేళ్ల పాటు ఉపయోగించవచ్చు. వీటిని సిలికాన్ రబ్బరుతో తయారు చేస్తారు. ఒక్కో కప్పు 5 నుంచి 10 సంవత్సరాలు వరకు ఉంటుంది. రోజులో 8 నుంచి 12 గంటల పాటు ధరించవచ్చు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు