ఎన్నో నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇటీవల జైలుపాలయ్యాడు. మహిళ ప్రొడ్యూసర్ ను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు అతడిపై కేసు నమోదు అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు శ్రీనివాస్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అది పూర్తయ్యాక కూడా మరో 14 రోజులు రిమాండ్ విధించింది.
ఇది కూడా చూడండి: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
Lady Aghori Bail
ఇక తాజాగా ఈ కేసులో అఘోరీకి ఊరట లభించింది. అఘోరి శ్రీనివాస్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అఘోరీ శ్రీనివాస్కు చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. మహిళ ప్రొడ్యూసర్ను బెదిరించిన కేసులో కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు రూ.5 వేల చొప్పున రెండు పూచీకతులు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే అఘోరి శ్రీనివాస్ పై మరో రెండు పెండింగ్ కేసులు ఉన్నాయి. మొకిల కేసులో బెయిల్ వచ్చినా.. మరో రెండు కేసుల్లో అఘోరీ శ్రీనివాస్ జైల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి !
మహిళా ప్రొడ్యూసర్ నుంచి 10 లక్షలు
గతంలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దుటూర్లోని ప్రగతి రిసార్ట్స్లో డిన్నర్కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్కు మాయ మాటలు చెప్పింది అఘోరీ . క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్గా రూ.5 లక్షలు తన అకౌంట్లోకి వేయించుకుంది.
ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది. దీంతో పూజల పేరుతో ఆ మహిళ నుంచి 10 లక్షలు కాజేసి.. మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు.
అఘోరీపై రేప్ కేసు
లేడీ అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్పై మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ కొత్తపళ్లికి చెందిన ఓ యువతి అఘోరీ శ్రీనివాస్పై కేసు పెట్టింది. సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న శ్రీనివాస్.. తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
తనను బెదిరించి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై 64(1), 87 318(4) 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
latest-telugu-news | telugu-news