KTR: ఫార్ములా ఈ కారు రేసు కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ

ఫార్ములా-ఈ కారు రేసింగ్‌ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.

New Update
KTR

KTR

ఫార్ములా-ఈ కారు రేసింగ్‌ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. ఈరోజు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు కేటీఆర్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి అధికారులు కేటీఆర్‌ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 7 గంటలకు పైగా విచారణ కొనసాగింది. అధికారులు 60కిపైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.      

Also Read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ''చట్టం  మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము .ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం.కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని  కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారని'' కేటీఆర్‌ ఆరోపించారు. 

Also Read: అంతా నీ ఇష్టమేనా?: పొంగులేటిపై పీసీసీ చీఫ్ సీరియస్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు