/rtv/media/media_files/2025/06/16/UFQ3lvuvUQ7WZI7lfZOv.jpg)
Ponguleti Vs Mahesh Kumar Goud
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలంటూ ఆయన చేసిన ప్రకటనపై మండిపడినట్లు సమాచారం. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని ఫైర్ అయినట్లు చర్చ సాగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటన చేయవద్దని స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకున్నాయి.