KTR సంచలన వ్యాఖ్య‌లు.. 6 నెల‌ల్లో 10 నియోజకవర్గాల ఉప ఎన్నిక‌లు ఖాయం!

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే 6 నెల‌ల్లో ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని KTR ధీమా వ్యక్తం చేశారు.

New Update
KTR

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే 6 నెల‌ల్లో ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని KTR ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని, పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని KTR తెలిపారు. ఎర్రవల్లిలోని KCR నివాసంలో బాన్స్‌వాడ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా KTR మాట్లాడుతూ.. భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ, గతంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమకు పరిపాలన చేతకావడం లేదని, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని నేరుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

KTR Comments On By Election

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్పీకర్ లేదా ఫిరాయింపుదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఆరు నెలల కాలంలో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ హెచ్చరించారు. పోచారం ఎమ్మెల్యే పదవి కూడా పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని, కానీ బీఆర్ఎస్‌లో ఉన్న ప్రతి కార్యకర్త గర్వంగా తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని చెప్పుకోవచ్చని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే ప్రజల పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. హామీల వైఫల్యం, నమ్మకద్రోహం ఒక కారణం అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల తీరు, వ్యవహార శైలి మరో ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిక్షణం కేసీఆర్ పేరు తలుచుకుంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, గత ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని కేటీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం కేవలం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అయితే, ఈ 21 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2.20 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిందని, ఆ అప్పుతో ఏ ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తోందని ఆరోపించారు.

యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని కేటీఆర్ అన్నారు. పంటల కొనుగోళ్లకు, ఆ తర్వాత వాటికి ఇవ్వాల్సిన బోనస్‌ను ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే యూరియా సరఫరా చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు