Bandi Sanjay: బీఆర్ఎస్ ఓటమి సంతోషాన్నిచ్చింది: బండి సంజయ్
అవినీతి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఓటమి సంతోషాన్నిచ్చిందన్నారు.
అవినీతి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఓటమి సంతోషాన్నిచ్చిందన్నారు.
తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో హై టెన్షన్ చోటు చేసుకుంది. పోలీసులే డబ్బులు పంచుతున్నారంటూ బండి సంజయ్ గొడవకు దిగారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డబ్బులు పంచుతున్నారని ఆందోళన చేశారు.
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు.
కమలాపూర్లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మందకృష్ణ.. బండి సంజయ్ ఒక యుద్ధ వీరుడు అని కొనియాడారు. కరీంనగర్ ప్రజలు లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సింగరేణి కార్మికులకు తమ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్మికులకు సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
సిరిసిల్ల జిల్లాలో ఓ చిట్టి ఎలుక తల బంతిలో ఇరుక్కుపోయింది. బంతి నుండి బయటికి రావడానికి ఆ ఎలుక ముప్పు తిప్పలు పడింది. రోడ్డుపై ఆటు, ఇటు పరిగెడుతూ విలవిలలాడింది. కాగా, అటు వైపు వెళ్తున్న స్ధానికులు ఎలుక వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేములవాడలో బీఎస్పీ ప్రజాఆశీర్వాద సభ నిర్వహిస్తుండగా అపశృతి చోటుచేసుకొంది.