RS Praveen meeting: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో బీఎస్పీ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి చోటు చేసుకుంది. ఒకసారిగా ప్రజా ఆశీర్వాద సభ వేదిక కుప్పకూలింది. భారీ గాలి దుమారం రావడంతో బీఎస్పీ ఏర్పాటు చేసిన సభ వేదిక కుప్పకూలింది. అయితే.. సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. అలాగే ఇనుప బొంగులు తాకి పలువురు కార్యకర్తలు మరియు నాయకులకు గాయాలు అయినట్లు సమాచారం. ఇక వెంటనే ఈ సంఘటనలో గాయపడిన వారిని కార్యకర్తలు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. ఈ సంఘటన జరిగిన సమయంలో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. అయితే.. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్కు ఎలాంటి గాయాలు కాలేదు.
పూర్తిగా చదవండి..Telangana Election 2023: ఆర్ఎస్ ప్రవీణ్ మీటింగ్లో కూలిన టెంట్.. బీఎస్పీ శ్రేణులకు తీవ్ర గాయాలు
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేములవాడలో బీఎస్పీ ప్రజాఆశీర్వాద సభ నిర్వహిస్తుండగా అపశృతి చోటుచేసుకొంది.

Translate this News: