Pawan Kalyan: రంగరాజన్ పై దాడి.. పవన్ ఆదేశాలతో రంగంలోకి జనసేన నేతలు.. చిలుకూరుకు వెళ్లి!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో తెలంగాణ జనసేన నేతలు ఈ రోజు చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ను కలిశారు. ఆయనపై జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనకు కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

New Update
Janasena Pawan Kalyan Ranga Rajan

Janasena Pawan Kalyan Ranga Rajan

Pawan Kalyan: దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు(Chilkur Balaji Temple) రంగరాజన్(Rangarajan) ను పరామర్శించాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి ఈ రోజు పవన్ కల్యాణ్‌ సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు తెలంగాణ జనసేన నేతలు రంగరాజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు, ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపన చెందుతున్న రంగరాజన్ పై దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Also Read: Chilukuru Temple Priest Rangarajan : రంగరాజన్ పై దాడి వారి పనే...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Also Read:  వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

దాడిని ఖండిస్తూ పవన్ ప్రకటన

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం ఆయన తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ఒక వ్యక్తిపై కాదని.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానన్నారు.
Also Read: KA Paul: రంగరాజన్‌పై దాడికి వారే కారణం.. కేఏ పాల్ సంచలన వీడియో!

దురదృష్టకరమైన ఘటన ఇదన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారన్నారు.

Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు