Jagtial Crime News
TG Crime: జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. అయితే అదే ప్రాంతం ఒక మానవత్వహీన ఘటనకు స్థానికులను తీవ్ర కలకలానికి గురిచేసింది. అంజన్న స్వామి మెట్లదారి సమీపంలో ఓ యువకుడి శవాన్ని గుర్తించిన పోలీసులు, విచారణ కొనసాగిస్తుండగా దారుణమైన నిజాలు బయటపడాయి. మృతుడిని జగిత్యాల జిల్లా మక్కపేటకు చెందిన ఉప్పు రమణారెడ్డి (30)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి హత్య వెనుక ఉన్న అసలు కారణాలను వెలికి తీశారు.
బీరు బాటిళ్లతో యవకుడికి దారుణంగా హత్య:
స్థానిక వివరాల ప్రకారం.. రమణారెడ్డికి ఈనెల 2వ తేదీన కొంతమంది యువకులతో గొడవ జరిగింది. చిన్నపాటి ఘర్షణగా మొదలైన ఆ విభేదాలు హత్య స్థాయికి దారి తీస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అశ్లీల పదజాలంతో పరస్పర దూషణలు జరగడంతో రగిలిపోయిన నిందితులు రమణారెడ్డిపై పగ పట్టారు. కొన్ని రోజుల తర్వాత అతడిని ఒంటరిగా చిక్కబెట్టిన వారు అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. బీరు బాటిళ్లను విరిగించి, వాటితో పొడిచిపోడి, అతడి ప్రాణాలు తీశారు. హత్య అనంతరం మృతదేహాన్ని అంజన్న స్వామి మెట్లదారి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు.
ఇది కూడా చదవండి: చెడు కొలెస్ట్రాల్ను త్వరగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ రూల్స్ పాటించండి!
అయితే.. రమణారెడ్డి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు అనుమానితులిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. వారే ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి సమాచారం ఆధారంగా పూడ్చిన స్థలాన్ని వెలికితీసిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన నిజమైన కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. భక్తుల రద్దీ ఉండే పవిత్ర స్థలమైన కొండగట్టులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భక్తులను నిరాశకు గురి చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మీరు కాలేయ రోగి అయితే మీ ఆహారంలో బీట్రూట్ రసాన్ని చేర్చుకోండి.. ఎందుకంటే!
( ts-crime | ts-crime-news | crime | Latest News | telugu-news)