/rtv/media/media_files/2025/06/20/enc-anil-kumar-2025-06-20-20-24-24.jpg)
ENc Anil Kumar
ENC Anil Kumar : తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) ఎం. అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ప్రస్తుత పదవి నుంచి తప్పించిన ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కు రిపోర్ట్ చేయాలని మాత్రమే ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు సంబంధిత విజిలెన్స్ దర్యాప్తులో ఆయన అనేక అవకతవకలు పాల్పడినట్టు నివేదికలు ఉన్నాయి.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
మేడిగడ్డ ఆనకట్ట గ్రౌటింగ్ వ్యవహారంలో అనిల్ కుమార్పై ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఆనకట్ట గ్రౌటింగ్ చేయడం మూలంగా బ్యారేజీకి సంబంధించిన ఎలాంటి పరీక్షలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదికలో వివరించింది. దీంతో ప్రభుత్వం అనిల్కుమార్ను ఈ విషయమై నిలదీసింది. ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారని అనిల్ కుమార్ ను ప్రభుత్వం ప్రశ్నించడంతో పాటు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్
ఈ విషయమై ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం, మంత్రులు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ ఈఈ నూనె శ్రీధర్ను బదిలీ చేసినప్పటికీ అక్కడే కొనసాగడానికి కూడా అనిల్ కుమార్ కారణమని ప్రభుత్వం గుర్తించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈఎన్సీ జనరల్గా ఉన్న అనిల్ కుమార్ను బదిలీ చేసినట్లు తెలిసింది.ఇక ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ గా ఉన్న అంజద్ హుస్సేన్కు ఈఎన్సీ జనరల్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే ఈఎన్సీ అడ్మిన్గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఇకనుంచి రెండు పోస్టుల్లో అదనపు బాధ్యతల్లో ఉండనున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్లు.. ఏవి మంచివి?