Maganti Gopinath: అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు.. ప్రముఖుల సంతాపం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KCR, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులు విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పలువురు రాజకీయ నాయకులు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. 

New Update
condolences 123

జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయం 5.45 గంటలకు AIG హాస్సిటల్‌లో చికిత్స్ పొందుతూ మృతి చెందారు. గుండెపోటుతో మూడు రోజుల క్రితం ఆయన హాస్పిటల్‌లో చేరారు. మాగంటి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, చంద్రబాబు, పలువురు సంతాపం తెలిపారు. 

ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గోపినాథ్ అంత్యక్రియలు జరపనున్నట్లు ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని మాదాపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు గోపీనాథ్ ఇంటికి చేరుకుంటున్నారు. తమ నాయకుడిని చివరిసారి చూసేందుకు, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు తరలివస్తున్నారు.

CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మాగంటి గోపీనాథ్ మృతిపట్ల CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ మృతికి సంతాపం తెలిపిన సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎమ్మెల్యే దానం కూడా సంతాపం తెలిపారు.తన స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఉ.5:45 కి మాగంటి తుది శ్వాస విడిచారు.

మాగంటి గోపీనాథ్ ఇంటికి KCR 

మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ సంతాపం తెలిపారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాసేపట్లో మాదాపూర్ లోని ఎమ్మెల్యే మాగంటి ఇంటికి కేసీఆర్ చేరుకోనున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి కొద్దీసేపటి క్రితం కేసీఆర్ బయలుదేరారు. మాగంటి భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం

మృతి పట్ల AP CM చంద్రబాబు ,మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TDPతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గోపీనాథ్, తాను చేపట్టిన పదవులను సమర్థంగా నిర్వహించారని ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

విచారం వ్యక్తి చేసిన హరీశ్ రావు

మాగంటి గోపీనాథ్ మృతి పట్ల మాజీమంత్రి హరీష్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

AIG హాస్సిటల్‌కు వెళ్లిన కేటీఆర్

మాగంటి మరణ వార్త వినగానే కేటీఆర్ ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. కేబీఆర్, మాగంటి కుమారులు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఈక్రమంలో కేటీఆర్, గోపీనాథ్‌లు కూడా ఫ్యామిలీ ఫెండ్స్. మాగంటి మృతి పట్ల కేటీఆర్ సంతాపం తెలిపారు.

brs mla maganti gopinath | brs-mla-maganti-gopinath | KTR - Maganti Gopinath | brs-mla | funeral | latest-telugu-news | chief-minister-revanth-reddy

Advertisment
Advertisment
తాజా కథనాలు